సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో గత 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైల్వెజ్ వర్కర్స్ అందరినీ క్రమబద్ధికరించాలని ... బి.జే.పీ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు వాసం పోలయ్య డిమాండ్ చేసారు ... రెగ్యులైజేషన్ కి అర్హులు కానీ వారందరినీ టైమింగ్ స్కేల్ ఇస్తూ,అన్ని జిల్లాల్లో ఉన్న డైల్వేజ్ వర్కర్లకు సమాన వేతనం ప్రతి నెల 5 లోపు చెల్లించాలి 50 రోజుల నుండి ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్స్ మరియు ఆశ్రం పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైవెజ్ వర్కర్స్ అందరినీ క్రమబద్ధికరించాలి అని ప్రధానమైన డిమాండ్ చేసినారు. రెగ్యులైజేషన్ కు అర్హులు కాని వారందరినీ టైమింగ్ పేస్కేల్ కలిపిస్తూ 30% పిఆర్సి కలుపుతూ అన్ని జిల్లాల్లో ఉన్న డైలీజ్ వర్కర్లకు సమానంగా ప్రతినెల 5లోపు జీతాలు చెల్లించాలి.ఆరోగ్య భీమా కల్పిస్తూ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి.2020 సంవత్సరంలో లాక్డౌన్ సమయంలో రావాల్సిన ఆరు నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలి.చనిపోయిన కుటుంబాలకు కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. మరియు సెలవులతో కూడిన 12 నెలల వేతనాలు ఇవ్వాలి. స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని... గత 50 రోజుల నుండి ధర్నా నిర్వహిస్తున్నారు.. పైన తెలిపిన డిమాండ్స్ అన్ని న్యాయబద్ధమైనవేనని వీటిని నెరవేశాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు బి.జే.పీ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు వాసం పోలయ్య, మాట్లాడుతూ గత 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వారి సమస్యలపై స్పందించాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు,
-----------------------
Admin