సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దేశ ప్రధాని మోదీ చిరకాల మిత్రుడు ఆదాని యొక్క షెల్ కంపెనీలలో వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చేయో తెలపాలని పార్లమెంట్ సాక్షిగా రాహూల్ గాంధీ ప్రశ్నిచడం వల్లనే మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అనర్హత వేటు వేసిందని నారాయణపేట డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి లు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ లోక్ సభలో ఆదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ ప్రసంగిచడం వల్లనే రాహుల్ గాంధీ పై కక్షపురితంగా వ్యవహరిస్తూ మోదీ ప్రభుత్వం అనర్హత వేటు వేసిందన్నారు. అప్పీల్ కోసం పై కోర్టు కు వెళ్లేందుకు నెల రోజులు కోర్టు గడువు ఇచ్చిన ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడమే కాకుండా, ఇంటిని ఖాళీ చేయాలని నోటిసులు పంపడం మోడీ ప్రభుత్వం వికృత చేష్టలకు నిదర్శనమన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ కి ప్రజల్లో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని వారు అన్నారు.2019లో కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ దొంగలను దొంగ అని ప్రసంగించారు.అందులో తప్పేముందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే వాటిపై ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విడతల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అయిన గాని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడక పోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు జి.సుధాకర్, శివకుమార్, మాజీ జడ్పి కో.ఆప్షన్ సభ్యుడు ఎండి.గౌస్,మండల అధ్యక్షులు సదాశివరెడ్డి, బాల్ రెడ్డి,యజ్ఞేశ్వర్ రెడ్డి,పేట పుర కౌన్సిలర్ ఎండి.సలీం, మక్తల్ పుర కౌన్సిలర్ నారాయణ, లిఖి రఘు,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహిముద్ ఖురేషి, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బాలకిష్టయ్య యూసుఫ్ తాజ్, శ్రీనివాస్, హాసనుద్దీన్, లింగం, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin