సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల లో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయంలో మంగళవారం వర్షం కోసం స్వామివారి పంచలోహ విగ్రహానికి భక్తులతో కలసి 108 బిందెలతో జాలాభిషేకం పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఆయన ఈసందర్బంగా మాట్లాడుతూ....సకాలంలో వర్షాలు కురిసి,అదునుకు పదునుతో పంటలు సమృద్ధిగా పండి సకల జనులు సుఖసంతోషాలతో, గ్రామాల్లో నిత్యకళ్యాణం పచ్చతోరణలుగా వర్ధిల్లాలని సంకల్పంతో 11 ఏళ్ళ క్రితం శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంటూ....11వ ఆలయ స్థాపన వార్షికోత్సవ ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా అయ్యప్పస్వామివారి విగ్రహంకు 108 బిందెలతో జలాభిషేకం పూజలు నిర్వహించారన్నారు. తెల్లవారుజామున నుండి విద్యాగణపతి, సుబ్రహ్మణ్యం స్వామివారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ అయ్యప్పస్వామి విగ్రహంకు జాలాభిషేకం ప్రారంభించాగా, గ్రామాల నుండి వచ్చిన భక్తులు,మహిళలు మధ్యాహ్నం వరకు 108 నిండు బిందెలతో జాలాభిషేకం చేసి భక్తిశ్రద్దాలతో పూజలు నిర్వహించరన్నారు.
-----------------------
Admin