సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గీరిజమ్మ వాల్మీకిల ST రిజర్వేషన్ పునరుద్ధరనకై విజయవాడ ధర్నా చౌక్ నందు చేపడుతున్న వాల్మీకుల సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా పెనుకొండ శాసన సభ సభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ తో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు, కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉన్నారని, వాల్మీకులకు రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా కూడా అండగా నిలిచారని, ST రిజర్వేషన్ పునరుద్ధరనకై సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ADCC EX-చైర్మన్ శ్రీ పామిడి వీరాంజనేయులు , అగ్రికల్చర్ అడ్వైసరీ బోర్డు మెంబర్ శ్రీ రాజారాం , ఇతర వాల్మీకి సోదర, సోదరీమణులు పాల్గొని వారి మద్దతును ప్రకటించారు.
-----------------------
Admin