సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో పత్రిక సమావేశం లో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలనుండి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, మొత్తం ప్రైవేట్ రంగానికి ఉతం ఇచ్చి బడా పెట్టుబడుదారులకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి దేశాన్ని అదొగతి పాలు చేసారన్నారు. రాయపూర్ లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్లీనారి సమావేశం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లో వస్తే యస్సి, బీసీ, ఎస్టీ వారికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేస్తామని తీర్మానం చేశారు. ఆ తీర్మానం కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని, ఎన్నికల మ్యానిపేస్టలో చేర్సలని కోరినారు. ఈ సమావేశం లో *మాలమహానాడు సీనియర్ నాయకులు, హుజుర్నగర్ మాల మహానాడు నియోజకవర్గం అధ్యక్షులు ఇట్టమల్ల శ్రీనివాసరావు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇట్టమల్ల బెంజిమన్, మాలమహానాడు ఉద్యోగుల మాలమహానాడు జిల్లా సలహాదారులు చప్పిడి బిక్షం, రాష్ట్ర కార్యదర్శి వీసం రాములు, జిల్లా ఉద్యోగుల సంఘ నాయకులు ఉదరి మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin