సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకర్గం, ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ, బూర్గుల, రాయికల్ గ్రామాలలోని నమోఅమృతపానం కార్యక్రమ అంబలి కేంద్రాలను, బిజెపి సీనియర్ నేత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... మద్యం వల్ల గ్రామాలలో ఎంతోమంది జీవితాలు ఆగమవుతున్నాయని, చెడు అలవాట్లను వదిలేసి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, రాజు, రమేష్ గౌడ్, కృష్ణ, సుభాష్ రెడ్డి బిజెపి కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin