సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేటు విద్యాసంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని పి.డి.యస్.యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి నాయకులు ముట్టడించారు... అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ స్నేహల మొగిలి , డీఈఓ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడగా దానికి నిరసనగా సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్యూ నాయకులు మస్తాన్, వెంకటేష్, సతీష్, లక్ష్మణ్, కరుణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin