సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రం ఇసుకను ఉచితంగా నిర్మాణాలకు ఇవ్వాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం. జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టౌన్ అధ్యక్షులు శీలం వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అందడం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన విధివిధానాలు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. ఇసుక రేట్లకు రెక్కలు రావడంతో ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని తద్వారా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆందోళన ఏర్పడుతుందని సొంత ఇండ్లు లేక కిరాయిలు చెల్లించలేక పస్తులు ఉంటున్న కుటుంబాలు లేకపోలేదన్నారు. తక్షణమే ఏపీ ఇసుక విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉపతల వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా టౌన్ కోశాధికారి కంచుపాటి రాంబాబు ఉపతల రామకృష్ణ కూరాకుల వీర నాగేశ్వరరావు ఉపతల నరేష్ నకిరేకంటి అంజయ్య కలకొండ వీరస్వామి షేక్ జాన్ సైదా కడియం మల్లేశ్వరరావు వెంకట్ నర్సు రాములు ఉపేందర్ గౌడ్ వెంకటేశ్వర్లు శ్రీను ప్రభాకర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin