సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షినటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని వరంగల్ జిల్లా గీసుకొండ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కె.పి పవన్ అన్నారు. తెలంగాణలో మీనాక్షినటరాజన్ పై కేసు ఉందనే సాకుతో రిజెక్ట్ చేశామంటున్న ఎన్నికల కమిషన్ బీజేపీ మోచేతి నీళ్లు తాగకుండా వూర్తి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసు లేదని పిర్యాదు మాత్రమే ఉందన్నారు. క్రిమినల్ కేసు ఉందన్న బీజేపీ నాయకుడి కంప్లైం ట్తోనే నామినేషన్ని ఎలా రిజెక్ట్ చేస్తారని దమ్ముంటే కేసు వివరాలు బయటపెట్టాలన్నారు. నటరాజన్పై పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు తాలూకు అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఉందని దీంతో నామినేషన్ని ఎలా రద్దు చేస్తారని అన్నారు. మోడీకి కాలం దగ్గర పడిందని రాహుల్ గాంధీకి భయపడి కాంగ్రెస్ ను ఎలాగైనా అంతమొందించాలనే ఒక నీచపు ఆలోచనతోనే ఈ రోజు బీజేపీ ఎన్నికల కమిషన్తో కలిసి ఈ కుట్రలు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఖచ్చితంగా కోర్టులో ఎన్నికల కమిషన్ బీజేపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. తెలంగాణ నుంచే బీమ పతనం మొదలవుతుందని, రాబోయే కాలం రాహుల్ గాంధీదే అని పేర్కొన్నారు.
-----------------------
Reporter