సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ఐక్యతా రాగంతో దేశం మొత్తం అడుగులు వేస్తూ సమైక్యత కోసం బాసటగా నిలుస్తూ దేశాన్ని ఐక్యం చేసిన భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేక్ తినిపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతుందని అన్నారు. రాహుల్ గాంధీ భావిభారత ప్రధాని అంటూ కీర్తించారు. ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తృణ ప్రాయంగా పదవిని త్యజించి తన కష్టంతో నెగ్గి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తపనతో కృషి చేస్తున్న ధీశాలి రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పలు గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin