తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *ఘనంగా పంచదశ వివాహ వార్షిక మహోత్సవం* పినపాక నియోజకవర్గం సర్కార్ టీవీ రిపోర్టర్ రాయల నవీన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలోగల మొరంపల్లి బంజర లో 50వ వార్షిక వివాహ వేడుక జరుపుకుంటున్న పుణ్య దంపతులు శ్యామల కొండారెడ్డి,పద్మావతి లకు అల్లుళ్లు, కూతుర్లు (గాదే ఉషశ్రీ-నర్సిరెడ్డి. విజయశ్రీ- శ్రీనివాస్ రెడ్డి) మరియు మనవరాళ్లు,మనవళ్లు పెద్దమ్మ తల్లి సన్నిధిలో అంగరంగ వైభవంగా50వ పెళ్లిరోజు కార్యక్రమాన్ని నిర్వహించి వారి వివాహ దాంపత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి సన్నిధిలో శతమానంభవతి అని కుటుంబ సభ్యులు ఈ దంపతులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే గంపా నారాయణరెడ్డి - సూరమ్మ దంపతుల పెద్ద కుమార్తె పద్మావతి వివాహం శ్యామల కొండారెడ్డి తో పెద్దలు నిశ్చయించినారు. వీరి వివాహ బంధం దాదాపు ఐదు దశాబ్దాలు పూర్తిచేసుకుని ఒకరికి ఒకరు తోడుగా వారి దాంపత్య జీవితం పలువురికి ఆదర్శం. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ దాంపత్యంలో ప్రకృతి వైపరీత్యాలు , కరువు, కరోనా వంటి విపత్తులను ఎదుర్కొని నేడు షష్టిపూర్తి జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి వారి శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని 50వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన గాదె నర్సిరెడ్డి- ఉషశ్రీ, విజయశ్రీ -శ్రీనివాస్ రెడ్డిలకు అత్తమామలు శ్యామల కొండారెడ్డి పద్మావతిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Reporter