Wednesday, 29 April 2026 11:07:41 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఏషియన్ ఉదయ భాస్కర్ సినిమా హాల్ యజమాన్యం తీరుపై ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రేక్షకులు

Date : 10 May 2025 12:04 PM Views : 734

తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *ఏషియన్ ఉదయ భాస్కర్ సినిమా హాల్ యజమాన్యం తీరుపై ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రేక్షకులు* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలో ఉన్న ఏసియన్ ఉదయ భాస్కర్ సినిమా థియేటర్లో అసౌకర్యాల నడుమ థియేటర్ నిర్వహణ ఉందని, పేరుకు మాత్రమే ఏసి ,లోనకు పోతే ఉక్కపోతే అంటూ వాపోయిన సినిమా ప్రేక్షకులు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రేక్షకులను దోచుకుంటున్న యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా డొంకన చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను కుటుంబ సభ్యులతో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని సినిమా థియేటర్ కి వెళ్లగా థియేటర్లో ఏసీ పనిచేయదు , సరైన ఫ్యాన్లు లేవు చెప్పుకోవటానికే సిగ్గు చేటుగా ఉందని, ఇలాంటి థియేటర్ కి ఎందుకు వచ్చానా అని బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మూత్రశాలలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు ,కలక్షన్లు ఏసీలకు తీసుకుంటున్నారు ప్రేక్షకులకు ఉడకపోతలో సినిమాలు చూపిస్తున్నారని వాపోయారు . ఇలాంటి అసౌక్యరాలు నడుమ థియేటర్ యజమాన్యం ప్రేక్షకులను దోచుకుంటున్న వైనంపై సిబ్బందిని ప్రశ్నించగా దురస ప్రవర్తనతో ప్రేక్షకులతో హేళనగా మాట్లాడినారని ఆవేదన చెందారు .ఇటువంటి థియేటర్ నిర్వహణ చేస్తున్న యజమాన్యం పై చర్యలు తీసుకొనుటకు సంబంధిత అధికారులు స్పందించి ప్రేక్షకులకు న్యాయం చేయాలని తెలిపారు ప్రేక్షకులకు న్యాయం జరిగే వరకూ, థియేటర్లో సౌకర్యాలు కల్పించే అంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామెర ఆదినారాయణ, ఎడారి రమేష్ పి రామకృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

-----------------------

రాయల్ నవీన్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :