తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అక్రమ ఫైనాన్స్ , అనధికార చిట్స్ నిర్వహిస్తున్న వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించాలి.... -ఏఐవైఎఫ్ షేక్ జహుర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలో గల పలు ప్రాంతాలలో చీటి, డైలీ ఫైనాన్స్, గిరిగిరి వ్యాపారస్తుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుందని ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జహుర్ అన్నారు. చట్టానికి విరుద్ధంగా నడిపించే ఈ ప్రైవేట్ చీటి పాటలు, ఫైనాన్స్ మరియు గిరిగిరి వ్యాపారస్తులు సామాన్య ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ పీడిస్తూ వారి వద్ద నుండి సొమ్ము రాయని కాల్లి చెక్కులు, ప్రాంసరీ నోట్లు మరియు బాండ్ పేపర్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సామాన్య ప్రజల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చెల్లించవలసిన సొమ్ము చెల్లించినప్పటికీ ప్రాంసరీ నోట్లు, సొమ్ము రాయని చెక్కులు, ఇచ్చేటప్పుడు ప్రజలను పిడిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు చెల్లించే విషయంలో కొంత ఎక్కువ సమయం పట్టిన వారి ఇళ్లకు వెళ్లి దుర్భాసలాడుతూ ఇళ్లల్లో నుంచి బయటకి లాగి వారిని మానసికంగా ఆత్మహత్యలు చేసుకునేదాకా చేసి వారి సొమ్మును రాబట్టుకోవడం వీళ్ళ ఎజెండా గా మారింది. సొమ్ము చెల్లించిన తర్వాత మా చెక్కులు, ప్రాంసరీ నోట్లు ఇవ్వమంటే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దురుసు మాటలు మాట్లాడుతున్నారు. చేసేదేమీ లేక పీడిత జనాలు బెంబోలెత్తిపోతున్నారు. గతంలో ఎస్పి రంగనాథ్ వారి ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల పరిధిలో ఏకకాలంలో చట్టానికి విరుద్ధంగా ఫైనాన్స్ నడిపిస్తున్న వారి ఇళ్లపై సోదాలు నిర్వహించగా వారి దగ్గర నుండి అనేక ప్రాంసరీ నోట్లు, బాండ్ పేపర్లు, నగదు రాయకుండా సంతకం చేపించుకున్న చెక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దాని తరువాత మండల గ్రామాలలో వడ్డీ వ్యాపారం కొంత తగ్గు ముఖం పట్టింది. మరలా అడిగే నాథుడు లేక మండలంలో వడ్డీ వ్యాపారానికి హద్దు అదుపు లేకుండా పోతుందని చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నఇటువంటి వారిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని పీడిత ప్రజలు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని కోరుతున్నట్లు తెలియజేశారు .
-----------------------
Reporter