తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆజాద్ పేరుతో పత్రిక ప్రకటన.... 2022 సెప్టెంబర్ 21 నుండి 27 వరకు పార్టీ 18వ వార్షికోత్సవాలను విప్లవ ఉత్సాహంతో దృఢ సంకల్పంతో గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకుందాం అని అజాద్ పిలుపునిచ్చారు. డివిజన్ కమిటీ వ్యాప్తంగా విప్లవా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కార్మిక వర్గం, అగ్రగామి దళం మావోయిస్టు పార్టీ ఏర్పడి 2022 సెప్టెంబర్ 21వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి అని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ 18 వారోత్సవాలను డివిజన్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కమిటీలు విప్లవ ప్రజలను పట్టణాలలో పల్లెల్లో దృఢ సంకల్పంతో విప్లవ ఉత్తేజంతో నిర్వహించుకోవాల్సిందిగా అని అన్నారు , అన్ని వర్గాల ప్రజలను కోరుతుంది ప్రజా యుద్ధాన్ని పురోగమింప చేయవలసిందిగా విప్లవ ప్రతిగతుగా వ్యూహాత్మక సమాధానం పహార్ దాడిని ఓడించాల్సిందిగా అని అన్నారు. భారత నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమాన్ని నిర్మూలించే ఉద్దేశంతో శత్రువులు అమలు చేస్తున్న బహుముఖ సమాదానం ప్రహార్ దాడిని తిప్పికొట్టే క్రమంలో ఏ సంవత్సర కాలంలో 124 మంది వీరులు, వీర నారులు తమ నిలువెత్తు లెత్తురుని ధారపోసి మావోయిస్టు ప్రజా యుద్ధాన్ని ప్రజా పోరాటం దేశ విముక్తి వీరుల నెత్తుటి అక్షరంతో లిఖించారు అని అన్నారు ఈ సంవత్సర కాలంలో శత్రు సమాధానం విరోచితంగా ఎదుర్కొని శత్రువు పథకాలను నమ్ముచేస్తూ పోరాటాలతో ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజల రాజ్యాధికార హక్కులను నిర్మించారు, జెల్, జంగిల్, జమీన్, కై పోరాడుతూ దేశ పీడిత ప్రజల విముక్తికై పోరాడుతున్న మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలను ప్రజల ప్రజాస్వామిక శక్తులు విజయోత్సవంతో జరుపుకోండి అని అన్నారు. డివిజన్ వ్యాప్తంగా ఆదివాసులు పోడు భూములు పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు, అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారుల దాడులకు వ్యతిరేకంగా ప్రజలు కదలాలి అటవీ భూములు బంజరు భూములు స్వాధీనం పోరాటాలు చేస్తూనే ఉన్నారు రైతుల సమస్యలపై అక్కడక్కడ ప్రజలు పోరాటాలోకి కదిలారు పోరాటాలు వేస్తున్నారు ఆయుధముగా రాజ్య అధికారాన్ని అస్తగతం చేసుకునే రాజకీయ చర్యల రూపాలలో ప్రజలు పోరాడుతున్నారు అని అన్నారు. కూడు, గూడు, గుడ్డ, తాగునీరు, వైద్య, భూమి సాగునీరు ఉపాధి లేని ప్రజల బతుకులు దుర్భరంగా మారి కొంతమంది ప్రజలకు ఒక పూట కూడా తిండి తినలేని స్థితి ఏర్పడిందిఅని అన్నారు.
-----------------------
Admin