తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్........ కొత్తగూడెం: ద్రావిడ ఉద్యమ పితామహుడు,సంఘసంస్కర్త,నాస్తికవాది,పెరియార్ ఇ.వి రామస్వామి నాయకర్ గారి 143వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పెరియార్ రామస్వామి నాయకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాద సిద్ధాంతానికి,ఆధిపత్య వర్గాల దోపిడీని ప్రశ్నించి,బహుజనులకు రాజ్యాధికారం రావాలని,అణచివేతకు గురైన వర్గాల ప్రజలు పాలకులుగా మారాలని,స్త్రీల బానిస సంకెళ్ళు తెంచి తమిళనాడు రాష్ట్రంలో బహుజన రాజకీయాలకు పునాది వేసిన మహనీయుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని కొనియాడారు యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ వీణ,సాయి,నాగుల రవికుమార్,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు బాపనపల్లి కళ్యాణ్,పవన్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin