Sunday, 01 March 2026 07:58:40 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

బుల్లెట్ బండి పాట పెళ్లి కొడుకు అశోక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు...

Date : 20 September 2022 07:31 PM Views : 2703

తెలంగాణ / హైద్రాబాద్ : బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్త పా" పాటతో పాపులరైన జంట అశోక్ , సాయి ప్రియ. డాన్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది సాయిప్రియ. ఇప్పుడు అశోక్‌ కు కూడా అలాంటి ఫేమ్ వచ్చేసింది. కాకపోతే డాన్స్ చేసి కాదు. అవినీతి చేసి. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అశోక్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు అశోక్. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా.. వలపన్ని పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంకు చెందిన అశోక్ కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి నిధుల్లో చేరారు. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు ఆయనకు సన్నిహితుల్లో ఓ స్టార్‌గా నిలబెట్టాయి. నిజానికి అశోక్ ఎలాంటి డాన్స్ చేయలేదు. ఆ వర్జినల్ పాటలో పెళ్లి కొడుకు అసలు లేడు. కానీ ఇక్క బారాత్ వేడుకలో ఆయన భార్య సాయి ప్రియ మంచి ఈజ్‌తో డాన్స్ చేసింది.. ఆమె ఎదురుగా అశోక్ ఉన్నాడు కాబట్టి.. ఇద్దరిది చూడముచ్చటైన జంట అని మంచి పబ్లిసిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిశారు. తనకేం సంబంధం లేదని.. కుట్ర చేశారని అశోక్ వాదించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. లంచం తీసుకుంటూండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ అంశం బుల్లెట్ బండి పాటంత వేగంగా వైరల్ అవుతోంది. ఆయన సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే .. అదీ కొంత గుర్తింపు వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా ఉండాలి. ఆ విషయాన్ని ఈజీ మనీ కోసం అశోక్ మర్చిపోయాడు. ఏసీబీకి చిక్కాడు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :